రేపటి నుంచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: మంత్రి శ్రీధర్‌ బాబు

డిసెంబరు 9 నుంచి అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ నూతన మంత్రివర్గ సభ్యుడు డి.శ్రీధర్ బాబు ప్రకటించారు.

By అంజి  Published on  8 Dec 2023 1:04 AM GMT
D Sridhar Babu, Free travel, women, RTC Bus,

రేపటి నుంచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్: డిసెంబరు 9 నుంచి అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ నూతన మంత్రివర్గ సభ్యుడు డి.శ్రీధర్ బాబు ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీల్లో రెండింటిని నెరవేర్చినట్లు కేబినెట్‌ సమావేశంలో ప్రకటించారు. ఇంకా, పారదర్శకత కోసం 2014 నుండి 2023 వరకు తెలంగాణ ఆర్థిక వివరాలపై వైట్‌ పేపర్‌ను విడుదల చేస్తామని శ్రీధర్ చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8న విద్యుత్ శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా, అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన హామీని నెరవేరుస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ వికలాంగ విద్యార్థి టి రజిని ఉద్యోగానికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. కాగా, డిసెంబర్ 9న శాసనసభ సభ్యుల (ఎమ్మెల్యే) ప్రమాణ స్వీకారం జరగనుంది.

Next Story