బాసరలో ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి.. పుణ్యస్నానాలకు వచ్చి చివరకు..

నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు.

By Knakam Karthik
Published on : 15 Jun 2025 2:00 PM IST

Telangana, Nirmal District, Basara, Five People Died

బాసరలో ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి.. పుణ్యస్నానాలకు వచ్చి చివరకు..

నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. నదిలో గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులు రాకేశ్​, వినోద్​, రుతిక్​, మదన్‌​గా గుర్తించారు. చనిపోయిన వారి మృతదేహాలను భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్​లోని చింతల్‌​కు చెందిన వారిగా గుర్తించారు. గోదావరిలో పుణ్య స్నానాలకు బాసరకు 18 మందితో కుటుంబసభ్యులు వచ్చారు. అనంతరం ఈ ఘటన జరగడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

నదిలో స్నానానికి దిగిన భక్తులు గల్లంతవడం చూసి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టిన పోలీసులు గజఈతగాళ్లతో రెస్క్యూ చేపట్టారు. గజ ఈతగాళ్లు నలుగురు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరొకరి కోసం ఇంకా గాలిస్తున్నారు.

Next Story