నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. నదిలో గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులు రాకేశ్, వినోద్, రుతిక్, మదన్గా గుర్తించారు. చనిపోయిన వారి మృతదేహాలను భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్లోని చింతల్కు చెందిన వారిగా గుర్తించారు. గోదావరిలో పుణ్య స్నానాలకు బాసరకు 18 మందితో కుటుంబసభ్యులు వచ్చారు. అనంతరం ఈ ఘటన జరగడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
నదిలో స్నానానికి దిగిన భక్తులు గల్లంతవడం చూసి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టిన పోలీసులు గజఈతగాళ్లతో రెస్క్యూ చేపట్టారు. గజ ఈతగాళ్లు నలుగురు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరొకరి కోసం ఇంకా గాలిస్తున్నారు.