డబ్బు, మద్యంతో కాదు.. ప్రజల కోసం పని చేస్తూ నాతో పోరాడండి: కేటీఆర్

Fight me by working for public, not by distributing money and liquor: KTR. డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభపెట్టే బదులు, తనపై పోటీ చేయాలనుకున్న ప్రతిపక్షాల అభ్యర్థులు తనకంటే ఎక్కువ

By అంజి  Published on  22 Sep 2022 12:43 PM GMT
డబ్బు, మద్యంతో కాదు.. ప్రజల కోసం పని చేస్తూ నాతో పోరాడండి: కేటీఆర్

డబ్బు, మద్యం పంచి ఓటర్లను ప్రలోభపెట్టే బదులు, తనపై పోటీ చేయాలనుకున్న ప్రతిపక్షాల అభ్యర్థులు తనకంటే ఎక్కువ మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకోవాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం అన్నారు. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ప్రజా సంక్షేమం కోసం పని చేయడంపై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. తాను నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశానని, అయితే ఎప్పుడూ ఓట్ల కోసం డబ్బు, మద్యం పంపిణీ చేయలేదన్నారు.

ఎన్నికల సమయంలో విపక్షాల అభ్యర్థులు చేస్తున్న అనైతిక చర్యలను పరిశీలించేందుకు నిరాకరించిన మంత్రి కేటీఆర్‌, ఓటర్లకు డబ్బు, మద్యం పంచి ఓట్లు పొందడం తనకు ఇష్టం లేదన్నారు. పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారని, వివిధ వేదికలపై వివిధ విషయాల గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజలకు ఏదైనా మంచి చేయడం మరింత సంతృప్తిని ఇస్తుందని ఆయన అన్నారు.

గురువారం సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిజిటల్ ట్యాబ్‌లను పంపిణీ చేసిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 'మన ఊరు-మన బడి' కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని తెలిపారు.

Next Story