మాజీ ఎమ్మెల్యే క‌న్నుమూత

Ex MLA Veera Reddy Passes Away. అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో

By Medi Samrat
Published on : 7 March 2021 11:32 AM IST

Ex MLA Veera Reddy Passes Away

తెలంగాణ ఓ నాయ‌కుణ్ని కోల్పోయింది. అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వీరారెడ్డి మృతితో ఆయ‌న కుటుంబంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ స‌భ్యులు, బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

ఇదిలావుంటే.. వీరారెడ్డి రెండు ప‌ర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ డీసీసీబీ చైర్మ‌న్ కూడా పని చేశారు. వీరారెడ్డి మృతి ప‌ట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు. కుటుంబ స‌భ్యుల‌కు త‌మ‌ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.


Next Story