వ‌చ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న : సీఎం కేసీఆర్‌

English medium in govt schools from next year CM KCR.వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2022 10:10 AM GMT
వ‌చ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న : సీఎం కేసీఆర్‌

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియం బోధ‌న ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌న‌ప‌ర్తి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం.. 'మ‌న ఊరు – మ‌న బ‌డి' కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా 'మ‌న ఊరు – మ‌న బ‌డి' పైలాన్‌ను మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ఆవిష్క‌రించారు. అనంత‌రంప్ర‌సంగించారు.

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ విద్యారంగాన్ని ప‌టిష్టం చేసేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు తెలిపారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న ఉంటుంద‌ని తెలిపారు. విద్యార్థులంతా ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సీఎం కోరారు. తామంతా కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దువుకుని పైకి వ‌చ్చిన వాళ్ల‌మే అని తెలిపారు. ఈ రోజు మీ ముందు ఈ హోదాలో నిల‌బ‌డ్డామంటే.. ఆరోజు గురువులు చెప్పిన విద్య‌నే కార‌ణమ‌ని చెప్పారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల‌ని సీఎం ఆకాంక్షించారు.

అనంత‌రం వనపర్తిలో అన్నిహంగులతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. త‌రువాత‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Next Story