తూప్రాన్‌లో దారుణం.. కానిస్టేబుల్ పై వాహనదారుడు గొడ్డలితో దాడి

Cop stops drunk man on bike, gets attacked with axe in Toopran. మద్యం మత్తులో బైక్‌ను సీజ్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్

By అంజి  Published on  18 Oct 2022 11:06 AM GMT
తూప్రాన్‌లో దారుణం.. కానిస్టేబుల్ పై వాహనదారుడు గొడ్డలితో దాడి

మద్యం మత్తులో బైక్‌ను సీజ్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్ పట్టణంలో మంగళవారం జరిగింది.

మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ మహ్మద్ హఫీజ్ (49) తలకు బలమైన గాయం కావడంతో అతడిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మల్లేష్ యాదవ్ (51) ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, హైవే వంతెన వద్ద నర్సాపూర్ రోడ్డులో వాహన తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ హఫీజ్ అతడి బైక్‌ను ఆపాడు.

యాదవ్ తన వాహన పత్రాలను చూపించడానికి నిరాకరించాడు. అతను మద్యం మత్తులో ఉన్నందున, హఫీజ్ అతడి బైక్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇతర పోలీసు సిబ్బంది వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరగంట తర్వాత యాదవ్ తిరిగి వచ్చాడు, చేతిలో గొడ్డలితో వెనుక నుండి కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. బాటసారులు యాదవ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించగా, హఫీజ్‌ను మొదట తూప్రాన్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు, అక్కడి నుండి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story