కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..రాష్ట్రంలో 96 మందికి పదవులు ప్రకటన

కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది

By Knakam Karthik
Published on : 10 Jun 2025 11:44 AM IST

Telangana, Congress Governmenr, AICC, Tpcc

కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..రాష్ట్రంలో 96 మందికి పదవులు ప్రకటన

కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పెద్ద ఎత్తున పార్టీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించింది. దాదాపు 96 మందికి పదవులు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఐదు కమిటీలను ప్రకటించిన పార్టీ తాజాగా 27 మంది నేతలకు పార్టీ ఉపాధ్యక్షులుగా, 69 మందికి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం అందించింది.

67 శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీ లకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. 20 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ లో క్రమశిక్షణ తో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పని చేస్తున్న అనేక.మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులకు టీపీసీసీ ఆఫీస్ బేరర్లు గా అవకాశాలు దక్కాయి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ తో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ పని చేసిన అనేక మంది కాంగ్రెస్ నాయకులకు స్థానం దక్కింది.

Next Story