ఇనుపరాడ్డుతో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కౌన్సిలర్‌ చేసిన దాడి ఘటన కలకలం రేపింది. ప్రజలకు రక్షణ ఉండాల్సిన కౌన్సిలరే.. స్థానికులపై దాడికి పాల్పడ్డాడు.

By అంజి  Published on  21 Feb 2024 6:03 AM GMT
Congress councilor, attack, Jammikunta

ఇనుపరాడ్డుతో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కౌన్సిలర్‌ చేసిన దాడి ఘటన కలకలం రేపింది. ప్రజలకు రక్షణ ఉండాల్సిన కౌన్సిలరే.. స్థానికులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జమ్మికుంట పరిధిలోని మూడో వార్డు కౌన్సిలర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా బోరు వేస్తున్నారని అదే వార్డుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆరోపించారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. బోరు వేయడం కూడా నిలిపివేయాలని హెచ్చరించారు.

దీంతో ఆగ్రహానికి గురైన కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ఫిర్యాదు చేసిన వారిపై ఇనుపరాడుతో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జమ్మికుంట మున్సిపాలిటీ లోని 3వ వార్డు అయిన రామన్నపల్లిలో ప్రభుత్వ పాఠశాల, వాటర్ ట్యాంక్ పక్కన గల సర్వే నంబర్ 422 లో కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, అక్రమంగా బోర్ వేస్తున్నాడని అదే వార్డుకు చెందిన మర్రి మల్లయ్య, కొలకని రాజు, మేడిపల్లి రమేష్ అక్కడికి వెళ్లి రవీందర్ ని బోర్ అక్రమంగా ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రవీందర్‌ వారిపై ఇనుప రాడ్‌తో దాడి చేయగా మల్లయ్య కు తలపై ,చేతులపై తీవ్ర గాయాలు కాగా, రాజుకి తలపై , రమేష్ కు చేతులపై గాయాలు అయ్యాయి.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత 2 నెలల క్రితం ఈ కబ్జా విషయంపై మర్రి మల్లయ్య స్థానిక తహశీల్దార్ కి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మనుసులో ఉంచుకొని కావాలని చంపాలనే ఉద్దేశ్యంతో తన భర్తపై దాడి చేసీ గాయపరిచాడని మల్లయ్య భార్య మర్రి రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు రవీందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై సీ ఆర్ నంబర్ 56/2024 యూ/ఎస్ 307, 506 ఐ పీ సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Next Story