19 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకం

కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నెరవేర్చారు.

By అంజి
Published on : 28 May 2025 9:39 AM IST

CM Revanth Reddy, job, woman, compassionate appointment

19 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకం

కారుణ్య నియామకం కోసం గత 19 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓ మహిళ కలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నెరవేర్చారు. హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబంలో సంతోషం నింపారు. వరంగల్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.భీమ్ సింగ్ సర్వీస్‌లో ఉండగా 24 సెప్టెంబర్‌ 1996లో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. తండ్రి మరణం నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు బి. రాజశ్రీ దరఖాస్తు చేసుకున్నారు. అయితే వివిధ సాంకేతిక కారణాలు చూపిస్తూ గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి.

రాజశ్రీ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాజశ్రీ సమస్యను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన రేవంత్ రెడ్డి నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని సీఎంఓ అధికారులకు సూచించారు. దాంతో హోం శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజశ్రీ తన కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే నాగరాజుతో వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Next Story