Telangana: కొత్త మంత్రులు వీరే.. సీఎం రేవంత్ విషెస్
నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
By అంజి
Telangana: కొత్త మంత్రులు వీరే.. సీఎం రేవంత్ విషెస్
హైదరాబాద్: నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్ఆనరు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రామచంద్రు నాయక్కు అవకాశం ఇచ్చారు. కాగా ఇవాళ రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:19 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వీళ్లతో ప్రమాణం చేయించనున్నారు. కొత్త మంత్రుల జాబితా రాజ్ భవన్ కు చేరడంతో ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మంత్రి వర్గ విస్తరణలో పలువురు నేతలకు నిరాశే ఎదురైంది. పదవి ఆశించిన రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి నేతలు భంగపాటుకు గురయ్యారు. అటు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి తదితరుల పేర్లు వినిపించినా.. వారికి చోటు దక్కలేదు. దీంతో ఈ నేతలకు మరికొంత కాలం ఎదురుచూపులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కుల గణన చేస్తే ఏం లాభం అన్నవారికి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఐదుగురికి ఐదు ఎమ్మెల్సీలు, ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ లో సామాజిక న్యాయం రాహుల్ గాంధీ ఆలోచనకు అద్దం పడుతున్నాయన్నారు.