రేషన్ కార్డుదారులకు భారీ గుడ్న్యూస్
నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో...
By - అంజి |
రేషన్ కార్డుదారులకు భారీ గుడ్న్యూస్
నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కిలలో బియ్యం ఇస్తారు. ఇక అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కిలోల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్ను పంపిణీ చేశారు.
రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో ఒకే విడతలో మూడు నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ వద్ద ఉన్న భారీ ఆహార ధాన్యాల నిల్వలను తగ్గించడంతో పాటు, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరుకులను చేరవేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.
ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించి కేటాయించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయనున్నారు. నెల మొత్తం ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. దీనివల్ల రేషన్ షాపుల వద్ద రద్దీ తగ్గడమే కాకుండా, లబ్ధిదారులకు తమ వాటా బియ్యాన్ని సేకరించుకోవడానికి తగిన సమయం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. గత సేకరణ సీజన్ల నుంచి గిడ్డంగుల్లో పేరుకుపోయిన నిల్వలను ఖాళీ చేసి, త్వరలో రాబోయే కొత్త స్టాక్ కోసం చోటు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని తరలించే ప్రక్రియ ఇప్పటికే వేగవంతమైంది.
సాంకేతికపరంగా కూడా ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తోంది. సాధారణంగా ప్రతి నెలా బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు మూడు నెలల కోటాను ఒక్కసారి బయోమెట్రిక్ ధృవీకరణతోనే పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల లబ్ధిదారులు పదేపదే రేషన్ షాపులకు రావాల్సిన అవసరం ఉండదు. అయితే, ఈ నిర్ణయం రేషన్ డీలర్లకు కొంత సవాలుగా మారింది. ఒకేసారి భారీ మొత్తంలో బియ్యం స్టాక్ వస్తుండటంతో షాపుల్లో నిల్వ ఉంచడానికి స్థలం సరిపోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరాన్ని బట్టి విడతల వారీగా డీలర్లకు సరఫరా చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు, ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త రేషన్ షాపులను ప్రారంభించేందుకు కూడా సిద్ధమవుతోంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న షాపులపై ఒత్తిడి తగ్గి, ప్రజలకు రేషన్ సరుకులు మరింత సులభంగా అందుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.