Telangana Polls: వారం రోజుల్లో.. రూ.100 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం స్వాధీనం

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువుల స్వాధీనం కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్లు దాటిందని అధికారులు తెలిపారు.

By అంజి  Published on  17 Oct 2023 5:21 AM GMT
Cash, gold, liquor,  Telangana , Assembly elections

Telangana Polls: వారం రోజుల్లో.. రూ.100 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం స్వాధీనం

హైదరాబాద్: వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నగదు, బంగారం, మద్యం, ఇతర వస్తువుల స్వాధీనం కేవలం వారం రోజుల్లోనే రూ.100 కోట్లు దాటిందని అధికారులు సోమవారం తెలిపారు. నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా రూ.109 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం తదితరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. అక్టోబర్ 16వ తేదీ ఉదయం 9 గంటలతో ముగిసిన 24 గంటల్లో రూ.7.29 కోట్ల స్వాధీనంతో అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.58.96 కోట్లకు పెరిగింది.

నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు రూ.109 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం తదితరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి. అక్టోబర్ 16వ తేదీ ఉదయం 9 గంటలతో ముగిసిన 24 గంటల్లో రూ.7.29 కోట్ల స్వాధీనంతో అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.58.96 కోట్లకు పెరిగింది.

119 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 30న ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో గత ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, ఉచిత పంపిణీ జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా, పోల్ ప్యానెల్ రాష్ట్ర, కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల ప్రారంభంలో మూడు రోజుల రాష్ట్ర పర్యటన తర్వాత, ఎన్నికల సంఘం ప్రేరేపణ రహిత ఎన్నికలను నిర్వహించడానికి పూర్తిగా కట్టుబడి ఉందని ప్రకటించింది. ఎన్నికల సమయంలో మనీ పవర్ వినియోగానికి వ్యతిరేకంగా చాలా కఠినంగా వ్యవహరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. మద్యం, నగదు, ఉచితాలు, మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని దాదాపుగా ఎండగట్టాలని ఆయన కోరారు.

Next Story