ఇండియన్ ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా నేను గర్వపడుతున్నా. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేది తప్ప లాభం చేకూర్చేది కాదు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే. ఈ విషయంలో పాజిటివ్గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో.. అంతే అప్రమత్తంగా ఉండి దేశ రక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్లుగా వారి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా..అని కేసీఆర్ పేర్కొన్నారు.