హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగులు ఎయిర్పోర్టుకు మెయిల్ పంపించి, బాంబు ఉందని బెదిరింపులకు గురి చేశారు. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు ఎయిర్పోర్టు మొత్తం తనిఖీలు చేపట్టాయి. ఎయిర్ పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపించి వేసి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. అనంతరం అధికారులు ఎయిర్పోర్టులో బాంబు లేదని తేల్చారు. కాగా రంగంలోకి దిగిన క్రైమ్ అధికారులు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.