'అన్ని గ్రామాల్లో శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయాలి'.. బండి సంజయ్‌ పిలుపు

Bandi calls for Shivaji statues across all villages in Telangana. హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో మరాఠా రాజు శివాజీ విగ్రహాలను ఏర్పాటు

By అంజి  Published on  18 Feb 2023 11:36 AM GMT
అన్ని గ్రామాల్లో శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయాలి.. బండి సంజయ్‌ పిలుపు

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో మరాఠా రాజు శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ శనివారం రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ''హిందూ పాలనను స్థాపించేందుకు చత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారు. మొఘలులు శివాజీ చిన్నతనంలో శివలింగాలపై మూత్ర విసర్జన చేసినప్పుడు అతని రక్తం ఉడికిపోయింది. పెద్దయ్యాక మొఘలులతో యుద్ధం చేసి తరిమి కొట్టాడు'' అని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సంజయ్ వ్యాఖ్యానించారు.

శివాజీని స్ఫూర్తిగా తీసుకుని హిందూ సమాజాన్ని ఏకం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు. శివాజీ విగ్రహాలు ఏర్పాటు చేయకపోతే హిందూ సమాజం అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. టైమ్‌పాస్ రాజకీయాలు చేయవద్దని అందరినీ కోరుతున్నానని కాషాయ పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి అన్నారు. హిందూ విశ్వాసం మరే ఇతర విశ్వాసాలకు వ్యతిరేకం కాదని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి అన్నారు.

''కానీ హిందూ మతాన్ని అవమానించడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది. కొందరు అలా చేస్తే స్పందించకపోవడం అన్యాయం. అయ్యప్ప, సరస్వతి దేవీలను అవమానించారు. ప్రాథమిక నిరసన కూడా చేయలేదు'' అని అన్నారు. రాష్ట్రంలో పెను వివాదానికి దారితీసిన హిందూ దేవుళ్లపై బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలను సంజయ్ ప్రస్తావించారు.

Next Story