రాజీవ్‌ యువ వికాసం.. తొలి విడతలో లబ్ధి వీరికే

యువతకు స్వయం ఉపాధే లక్ష్యంగా రాజీవ్‌ యువ వికాసం పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

By అంజి
Published on : 31 May 2025 6:40 AM IST

Rajiv Yuva Vikasam Scheme, Telangana

రాజీవ్‌ యువ వికాసం.. తొలి విడతలో లబ్ధి వీరికే

యువతకు స్వయం ఉపాధే లక్ష్యంగా రాజీవ్‌ యువ వికాసం పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 16.23 లక్షల దరఖాస్తులు రాగా.. జూన్‌ 2న తొలి విడతలో లక్ష మందికిరూ.50 వేలు, రూ.లక్ష లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ఇవ్వనుంది. జూన్‌ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. జూన్‌ 10 నుచం 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ, జూన్‌ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయి. రూ.1 నుంచి 2 లక్షలు, రూ.2 నుంచి 4 లక్షల యూనిట్లకూ త్వరలో నిధులు మంజూరుకానున్నాయి.

రాజీవ్ యువ వికాసం పథకంపై ఇటీవల సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుంచి 9 వరకు అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు భట్టి విక్రమార్క తెలిపారు. ఆ తర్వాత చేపట్టే యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. అక్టోబర్ 2 నాటికి ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

Next Story