యువతకు స్వయం ఉపాధే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 16.23 లక్షల దరఖాస్తులు రాగా.. జూన్ 2న తొలి విడతలో లక్ష మందికిరూ.50 వేలు, రూ.లక్ష లోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ఇవ్వనుంది. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 10 నుచం 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ, జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయి. రూ.1 నుంచి 2 లక్షలు, రూ.2 నుంచి 4 లక్షల యూనిట్లకూ త్వరలో నిధులు మంజూరుకానున్నాయి.
రాజీవ్ యువ వికాసం పథకంపై ఇటీవల సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుంచి 9 వరకు అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు భట్టి విక్రమార్క తెలిపారు. ఆ తర్వాత చేపట్టే యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. అక్టోబర్ 2 నాటికి ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.