నిజామాబాద్ పసుపు బోర్డు ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 29న కేంద్ర హోంశాఖ అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 29న నిజామాబాద్లో కిసాన్ సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక ఎంపీ అర్వింద్తో కలిసి కేంద్రమంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. బోర్డు ప్రారంభం అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షాతో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కలిసి తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారు.
పసుపు ధరలు పెరిగేలా, వ్యాల్యూ యాడెడ్ ఉత్పత్తుల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు గౌరవం పెరగాలన్నదే ఉద్దేశ్యం. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుచేయడం ప్రధాని మోదీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి లభించిన ఒక అద్భుత బహుమతి.. అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.