గణేశ్ నిమజ్జ శోభాయాత్రతో సందడి చేసేందుకు హైదరాబాద్ నగరం రెడీ అవుతోంది. ఈ శోభాయాత్రకు స్పెషల్ గెస్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు ఆయన రాష్ట్రానికి వస్తున్నారు.సెప్టెంబర్ 6 ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టులు దిగనున్నారు. ఉదయం 11.30 గంటలనుంచి 12.30 వరకు ITC కాకతీయలో బీజేపీ ముఖ్యనేతలో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 1గంటకు చార్మినార్ దగ్గర వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు అమిత్ షా. మధ్యాహ్నం 3.30 కి ఎంజే మార్కెట్ దగ్గర నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తారు.