Telangana: విద్యుత్ శాఖలో ఫోన్-పే ద్వారా లంచాలు..8 మంది అధికారులు సస్పెండ్!

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL)లో అవినీతికి పాల్పడిన ఎనిమిది మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది

By -  Knakam Karthik
Published on : 19 Feb 2026 8:06 PM IST

Telangana, TGSPDCL, Anti Bribe Cell, Corruption, Electricity Dept, PhonePe Bribe

Telangana: విద్యుత్ శాఖలో ఫోన్-పే ద్వారా లంచాలు..8 మంది అధికారులు సస్పెండ్!

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL)లో అవినీతికి పాల్పడిన ఎనిమిది మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కస్టమర్ల నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ, ఏకంగా డిజిటల్ పేమెంట్స్ ద్వారా వసూళ్లకు పాల్పడటంతో ఈ చర్యలు తీసుకున్నారు. విద్యుత్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై ఎండీ (MD) ఫిబ్రవరి 18న సమీక్ష జరిపారు.

కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి, ప్యానెల్ బోర్డుల ఏర్పాటుకు మరియు ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు కోసం ఈ అధికారులు భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. కొందరు అధికారులు ఏకంగా PhonePe ద్వారా లంచాలు తీసుకోవడం గమనార్హం. లంచం కోసం ఫోన్ కాల్స్‌లో బేరసారాలు ఆడుతున్న రికార్డులు, డిజిటల్ పేమెంట్ ఆధారాలు దొరకడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు (ADEs), అసిస్టెంట్ ఇంజనీర్లు (AEs), మరియు సబ్-ఇంజనీర్లు ఉన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ప్రజలను వేధించినా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం ఈ సందర్భంగా హెచ్చరించింది.

Next Story