తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

By సుభాష్  Published on  27 Aug 2020 3:31 AM GMT
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2795 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. కరోనాతో కొత్తగా 8 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 796కు చేరుకుంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,14,483 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 27,600 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో 30,772 శాంపిళ్లు పరీక్షించగా, 1075 శాంపిళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 449 పాజిటివ్‌ కేసులు, కరీంనగర్‌ 136, ఖమ్మం 152, మహబూబాబాద్‌ 102, మంచిర్యాల 106, మేడ్చల్‌ 113, నల్గొండ, 164, నిజామాబాద్‌ 112, రంగారెడ్డి 268, సిద్దిపేట 113, వరంగల్‌ అర్బన్‌ 131 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో వందలోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 20,866 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజాగా నిన్న 872 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు 86,095 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి.

తాజాగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో హైదరాబాద్‌లో ఎక్కువగా కేసులు నమోదైతే ఇతర జిల్లాల్లో కేసులు పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్ని జిల్లాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. కొందరి వల్ల కరోనా వ్యాప్తి అధికంగా పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నా.. కొందరు అవేమి పట్టించుకోవడం లేదని, ఇలా అయితే మున్ముందు రాష్ట్రంలో మరింత ప్రమాదం పొంచివుండే అవకాశాలున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.

Next Story