నేటి నుంచి తాజ్‌మహల్‌ అందాలు చూడొచ్చు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2020 4:01 AM GMT
నేటి నుంచి తాజ్‌మహల్‌ అందాలు చూడొచ్చు

తాజ్‌మహల్‌ అందాలను చూసేందుకు పర్యాలకు అవకాశం దక్కింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో మార్చి 17 నుంచి తాజ్‌మహల్‌ సందర్శనను నిలిపివేశారు. అన్‌లాక్‌ 4లో భాగంగా నేటి నుంచి తాజ్‌మహల్‌, ఆగ్రా ఫోర్ట్‌ తెరుచుకున్నాయి. కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు పర్యాటకులకు అనుమతి ఇస్తున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత పర్యాటకులను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు అనుమతి ఇస్తున్నారు. రోజుకు సుమారు 5వేల మంది పర్యాటకులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

తాజ్‌మహల్‌ సందర్శనకు మధ్యాహ్నం వరకు 2500, ఆ తర్వాత మరో 2500 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. క‌రోనా వైరస్‌ వ్యాప్తి నిరోధ‌క చ‌ర్య‌ల్లో భాగంగా పేపర్‌ టికెట్ల జారీని నిలిపి వేసి, ఎలక్ట్రానిక్‌ టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేశారు. అలాగే ఎప్పటికప్పుడు అధికారులు శానిటైజ్‌ పనులు చేపట్టనున్నారు. కాగా.. మ‌ళ్లీ తాజ్‌మ‌హ‌ల్ అందాల‌ను వీక్షించే అవ‌కాశం రావ‌డంతో ప‌ర్యాట‌కులు ఆనంద‌ప‌డుతున్నారు.

Next Story