సుశాంత్‌ ఆ సినిమాకి రూ.12కోట్లు డిమాండ్‌ చేసాడట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sep 2020 7:12 AM GMT
సుశాంత్‌ ఆ సినిమాకి రూ.12కోట్లు డిమాండ్‌ చేసాడట

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు పలు ములపులు తిరుగుతోంది. సుశాంత్ మరణం తరువాత డ్రగ్స్‌ కోణం బయటకు రావడంతో ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్‌ చేశారు ఎన్‌సీబీ అధికారులు. సుశాంత్‌తో సంబంధాలున్న ప్రతి ఒక్కర్నీ ఎన్‌సీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. తాజాగా సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహాని రెండు రోజుల పాటు అధికారులు విచారణ చేశారు.

చివరిగా తాను జూన్ 5న సుశాంత్ తో ఓ సినిమా గురించి మాట్లాడానని ఆమె వెల్లడించినట్లు పలు జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి. సుశాంత్ కు టాలెంట్ మేనేజర్ గా ఉన్న తాను పలు ఆఫర్లను సుశాంత్ కు తెచ్చానని, 2016 నుంచి అతనికి సేవ చేశానని చెప్పింది. మార్చిలోనే సుశాంత్ ప్రవర్తన మారిపోయిందని, దీంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పింది. తాను ఇంట్లో ఉన్న కాసేపట్లో హాల్, బెడ్ రూమ్ మధ్య చాలాసార్లు తిరిగాడని, కుమార్ మంగళ్ తెరకెక్కించాలని భావించిన చిత్రం గురించి తాము మాట్లాడుకున్నామని తెలిపింది. కథ నచ్చిన తరువాత రూ. 6 కోట్లకు సినిమా చేసేందుకు అంగీకరించిన సుశాంత్.. ఆ తరువాత రూ. 12 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేశాడని వెల్లడించింది.

అంతకన్నా ముందు 'సన్ చురియా' సినిమాకు రూ. 5 కోట్లు,'కేదార్ నాథ్' కు రూ. 6 కోట్లు తీసుకున్న సుశాంత్, 'డ్రైవ్' కు రూ.2.25 కోట్లు, 'చిచ్చోరే' కు రూ. 5 కోట్లు, 'దిల్ బేచారా'కు రూ. 3.5 కోట్లు తీసుకున్నాడని కూడా ఆమె తెలిపింది. ఇక తాను 2016 నుంచి 2019 మధ్య 21 బ్రాండ్లతో సుశాంత్ కు డీల్స్ కుదిర్చానని విచారణలో ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా.. గత సంవత్సరం డిసెంబర్ లోనే తాను మానసికంగా కుంగిపోయానని సుశాంత్ వెల్లడించినట్టు అధికారుల విచారణలో పేర్కొంది.

Next Story