IPL -2023: మరోసారి కెప్టెన్‌గా మారిన కోహ్లీ

ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతూ ఉన్నాయి. ఈ మ్యాచ్ కు మొహాలీలోని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 April 2023 11:00 AM GMT
IPL 2023, RCB Captain, Virat Kohli

IPL -2023: మరోసారి కెప్టెన్‌గా మారిన కోహ్లీ 

ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతూ ఉన్నాయి. ఈ మ్యాచ్ కు మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టు సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఈ మ్యాచ్ కు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగనున్నాడని తాత్కాలిక సారథి విరాట్ కోహ్లీ వెల్లడించాడు. డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ కు దూరంగా ఉంటాడని వివరించాడు. గతంలో ఆర్సీబీకి కెప్టెన్ గా వ్వవహరించిన కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా మరోసారి కెప్టెన్ గా కనిపించనున్నాడు. ఈ టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించగా, ఆర్బీబీ జట్టు 5 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా శామ్ కరన్ ఉన్నాడు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు:

ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), సుయాష్ ప్రభుదేసాయి, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్.

పంజాబ్ కింగ్స్:

అథర్వ, మాథ్యూ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్ (సి), జితేష్ శర్మ (WK), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.

Next Story