సిరీస్ ఓట‌మిపై హార్దిక్ వ్యాఖ్య‌లు.. వెర్రి మాటలు వ‌ద్ద‌న్న టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది

By Medi Samrat  Published on  14 Aug 2023 9:25 AM GMT
సిరీస్ ఓట‌మిపై హార్దిక్ వ్యాఖ్య‌లు.. వెర్రి మాటలు వ‌ద్ద‌న్న టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఐదో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ప్రకటనతో విమర్శకులకు ట్రోల్ చేయడానికి మరో అవకాశం ఇచ్చాడు. ఓట‌మిపై భారత మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ట్వీట్‌ను షేర్ చేస్తూ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డాడు.

సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ప్రకటనలో కొన్నిసార్లు ఓడిపోయినా తేడా ఉండదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రకటన చేయడం భారం అవుతుందని హార్దిక్ భావించి ఉండకపోవచ్చు. సోషల్ మీడియాలో అత‌డిని ట్రోలర్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

భారత మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్.. హార్దిక్ పాండ్యా ప్రకటనను మూర్ఖపు ప్రకటనగా అభివర్ణించాడు. ఈ మేర‌కు ట్విట‌ర్‌లో హార్దిక్‌ను తీవ్రంగా విమర్శించారు.

భారత జ‌ట్టు ప‌రిమిత ఓవర్ల క్రికెట్‌లో కొన్ని నెలల క్రితం ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టుపై ఓటమిని ఎదుర్కొంది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఓడిపోయాం. అతను వెర్రి ప్రకటనలు చేయకుండా.. ఈ ఓటమి నుండి బలహీనతలపై దృష్టి పెడతాడని ఆశిస్తున్నాను.

"కేవలం 50 ఓవర్లు మాత్రమే కాదు.. వెస్టిండీస్ చివరి టీ20 ప్రపంచ కప్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. టీమ్ ఇండియా పేలవమైన ఫామ్ చూసి చాలా నిరాశ చెందారు. జట్టుకు గెలవాలనే ఆత్రుత కొరవడిందని తెలుస్తోంది. వెర్రి మాటలు కాకుండా ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.

Next Story