39 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించబోతున్న అశ్విన్..!
భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బాష్ లీగ్లో పాల్గొనడం ద్వారా చరిత్ర సృష్టించనున్నాడు.
By - Medi Samrat |
భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్ బాష్ లీగ్లో పాల్గొనడం ద్వారా చరిత్ర సృష్టించనున్నాడు. 39 ఏళ్ల అశ్విన్ ఈ ప్రతిష్టాత్మక టీ20 లీగ్లో ఆడుతున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్, IPL నుండి రిటైర్ అయిన అశ్విన్.. బిగ్ బాష్ లీగ్లో సిడ్నీ థండర్ తరపున ఆడనున్నాడు. సిడ్నీ థండర్ ఫ్రాంచైజీ తన అధికారిక ప్రకటనను వచ్చే వారంలో చేస్తుంది. ఐఎల్టి20 వేలంలో అశ్విన్ కూడా ప్రవేశించనున్నాడు.
ILT20 వేలం జనవరి 4న ముగుస్తుంది. దీని తర్వాత అశ్విన్ సీజన్ రెండవ అర్ధ భాగంలో సిడ్నీ థండర్లో చేరే అవకాశం ఉంది. BBL డిసెంబర్ 14 నుండి జనవరి 18 వరకు జరుగుతుంది. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ ఈ నెల ప్రారంభంలో అశ్విన్ను సంప్రదించి బీబీఎల్లో పాల్గొనే అవకాశాలపై చర్చించారు.
రవిచంద్రన్ అశ్విన్ గత నెలలో ఐపిఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అతని కోసం విదేశీ టి 20 లీగ్ల తలుపులు కూడా తెరిచాయి. చురుకైన ఆటగాళ్లు విదేశీ లీగ్లలో పాల్గొనకుండా బీసీసీఐ నిషేధం విధించింది. ఇందులో ఐపీఎల్, జాతీయ జట్టుకు ఆడే ఆటగాళ్లు ఉన్నారు.
అశ్విన్ ఈ సంవత్సరం BBL ఓవర్సీస్ డ్రాఫ్ట్ కోసం నమోదు చేసుకోలేదు. 2022లో మార్టిన్ గప్టిల్ పొందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అశ్విన్కు కూడా మినహాయింపు ఇవ్వాలి. గప్టిల్ ఆ సమయంలో మెల్బోర్న్ రెనెగేడ్స్లో చేరాడు. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
టెస్టుల్లో అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ 537 వికెట్లు, కుంబ్లే 619 వికెట్లు సాధించారు. అదే సమయంలో ఐపీఎల్లో అశ్విన్ 221 మ్యాచుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. అతను బ్యాటింగ్ల 833 పరుగులు చేశాడు.