రాబోయే దేశీయ సీజన్కు ముందు వేరే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు ముంబై బ్యాటర్ పృథ్వీ షా. నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోరుతూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కి లేఖ రాశారు. రాబోయే సీజన్లో పృథ్వీ షాకు ఏ జట్లు ఆఫర్లు పంపాయో ఇంకా తెలియదు. కెరీర్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో స్టేట్ అసోసియేషన్కు మారాల్సిన అవసరం ఏర్పడిందని ముంబై అసోసియేషన్కు రాసిన లేఖలో షా స్పష్టం చేశాడు. మూడ్నాలుగు జట్ల నుంచి తనకు అవకాశాలు వస్తున్నాయని, ముంబై నుంచి మరో టీమ్కు మారడం వల్ల ఒక క్రికెటర్గా తాను మరింత ఎదగగలనని అనిపిస్తోందని లేఖలో రాసుకొచ్చాడు పృథ్వీ షా.
25 ఏళ్ల షా గత కొన్ని నెలలుగా తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలిచాడు. అతని ఫిట్నెస్ సరిగా లేదని పేర్కొంటూ ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీ గత సంవత్సరం రంజీ ట్రోఫీ నుండి అతన్ని తొలగించింది. అతనికి రెండు వారాల ఫిట్నెస్ ప్రోగ్రామ్ను సూచించారు. "అవును, పృథ్వీ షా మాకు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరుతూ ఒక లేఖ రాశారు. మేము అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో దీనిపై చర్చిస్తున్నాము. ఈ రోజుమేము మా నిర్ణయం తీసుకుంటాము" అని MCA కార్యదర్శి అభయ్ హడప్ ధృవీకరించారు.