10 మీట‌ర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు నిరాశే

Poor start by Manu and Saurabh in qualification stage 2.పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలోనూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 2:22 AM GMT
10 మీట‌ర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు నిరాశే

పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలోనూ భార‌త్‌కు నిరాశే ఎదురైంది. క్వాలిఫికేషన్‌-2లో మను భాకర్‌ – సౌరభ్‌ చౌదరి జోడీ నిరాశ‌ప‌రిచారు. 8 టీముల్లో 7వ స్థానంతో స‌రిపెట్టుకున్నారు. క్వాలిఫికేషన్ స్టేజీ-1లో 582 పాయింట్లతో అగ్ర‌స్థానంలో నిలిచిన ఈ జోడి.. రెండో రౌండ్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయింది. దీంతో ప‌త‌క మ్యాచ్‌ల‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయారు.

అలాగే.. యశస్విని- అభిషేక్ వర్మ జోడీ సైతం నిరాశపరిచింది. ఈ జోడీ 17వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఒలిపింక్స్‌ ఐదో రోజు ఆరు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పాల్గొనున్నారు. టేబుల్ టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో శరత్ కమల్ ఈ రోజు బరిలోకి దిగనున్నాడు. భారత పురుషుల హాకీ జట్టు స్పెయిన్‌తో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌రాజ్‌ రాన్‌కీరెడ్డి, చిరాగ్‌శెట్టి బ్యాట్మింటన్‌ గ్రూప్‌-ఏలో పాల్గొననున్నారు. అలాగే సెయిలింగ్, బాక్సింగ్‌లోనూ భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Next Story