ఎట్టకేలకు అతడిని జట్టులో నుండి తీసేశారు
చెన్నైలో ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై జట్టుతో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు తలపడనుంది.
By Medi Samrat
చెన్నైలో ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై జట్టుతో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు తలపడనుంది. అయితే ఎట్టకేలకు పంజాబ్ జట్టు మ్యాక్స్ వెల్ ను జట్టు నుండి తప్పించింది. ఘోరమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న మ్యాక్స్ వెల్ ను జట్టు నుండి తీసేశారు. మ్యాక్స్ వెల్ వేలుకు ఫ్రాక్చర్ అయిందని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ సమయంలో చెప్పారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని(w/c), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), జోష్ ఇంగ్లిస్ (w), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంశ్ షెడ్జ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: అన్షుల్ కాంబోజ్, రవిచంద్రన్ అశ్విన్, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, ముషీర్ ఖాన్, విజయ్కుమార్ వైషాక్, జేవియర్ బార్ట్లెట్, ప్రవీణ్ దూబే