జావెలిన్ త్రో.. ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన నీర‌జ్ చోప్రా

Neeraj Chopra Qualifies for mens Javelin throw final.పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్​-ఏలో భార‌త్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 2:36 AM GMT
జావెలిన్ త్రో.. ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన నీర‌జ్ చోప్రా

పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్​-ఏలో భార‌త్‌కు చెందిన నీరజ్‌ చోప్రా సంచ‌ల‌నం సృష్టించాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఈ యువ క్రీడాకారుడు పైన‌ల్‌కు అర్హ‌త సాధించాడు. గ్రూప్ ఏ క్వాలిఫికేష‌న్ రౌండ్ తొలి ప్ర‌యత్నంలోనే 86.55 మీట‌ర్ల దూసం విసిరి నేరుగా ఫైన‌ల్‌కు చేరుకున్నాడు. ఈ సీజన్‌లో నీరజ్‌ అత్యుత్రమ త్రో ఇదే కావడం విశేషం. ఇదే గ్రూప్‌లో ఫిన్లాండ్‌కు చెందిన లస్సీ ఎటలాట 84.50 మీటర్ల త్రోతో నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఆ తర్వాత రొమేనియాకు చెందిన అలెగ్రాండ్రూ మిహైతో నోవాక్‌ 83.27 మీటర్లు విరిసి మూడుస్థానంలో నిలిచాడు. జావెలిన్ త్రో ఫైన‌ల్ ఈ నెల 7న జ‌రుగుతుంది.

ఒలింపిక్స్‌లో నేటి భారత్‌ షెడ్యూల్‌

- ఉ.8 గంటలకు మహిళల 400 మీ. హార్డిల్స్‌ ఫైనల్‌

- ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగం (రవికుమార్‌)

- ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్‌ మహిళల 57 కిలోల విభాగం (అన్షుమాలిక్‌)

- ఉ.8 గం.ల నుంచి రెజ్లింగ్‌ పురుషుల 86 కిలోల విభాగం (దీపక్‌ పునియా)

- ఉ.11 గంటలకు బాక్సింగ్‌ మహిళల 69 కిలోల విభాగం సెమీస్‌ (లవ్లీనా)

- మధ్యాహ్నం 2:45 గంటల నుంచి రెజ్లింగ్‌ సెమీఫైనల్‌

- మధ్యాహ్నం 3:30 నుంచి హాకీ మహిళల సెమీస్‌ (భారత్‌-అర్జెంటీనా)

- సాయంత్రం 5:35 నుంచి పురుషుల 800 మీ. హార్డిల్స్‌ ఫైనల్‌

- సాయంత్రం 6:25 నుంచి పురుషుల 200 మీ. హార్డిల్స్‌ ఫైనల్‌

Next Story