భారత క్రికెటర్ మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్గా మహ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. మిచెల్ స్టార్క్ 5,240 బంతులలో ఈ రికార్డును సాధించగా.. ఈ మైలురాయిని చేరుకోవడానికి షమీ 5126 బంతులు మాత్రమే తీసుకున్నాడు. మ్యాచ్ల విషయానికొస్తే షమీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా జాయింట్-రెండవ స్థానంలో ఉన్నాడు. అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు సాధించిన భారత బౌలర్. తన 104వ వన్డే మ్యాచ్లో షమీ ఈ ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై షమీ ఈ రికార్డును అందుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో బంగ్లాను టీమిండియా ఓడిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట మరో అరుదైన రికార్డు నమోదవుతుంది. భారత మాజీ కెప్టెన్లు మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్ లను గెలిచిన నాలుగో భారత సారథిగా రోహిత్ నిలుస్తాడు. రోహిత్ నాయకత్వంలో భారతజట్టు ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 137 మ్యాచ్ లలో ఆడి 99 విజయాలు సాధించింది.