ముంబైకి మ‌రో ఓట‌మి.. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న కేకేఆర్‌..!

KKR సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం అంతరాయం కలిగించిన గ‌త‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది

By Medi Samrat  Published on  12 May 2024 2:05 AM GMT
ముంబైకి మ‌రో ఓట‌మి.. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న కేకేఆర్‌..!

KKR సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం అంతరాయం కలిగించిన గ‌త‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. ఈ గెలుపుతో KKR తొమ్మిది విజయాలను నమోదు చేసి 18 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు చేరుకోగా.. ముంబై 13 మ్యాచ్‌ల్లో తొమ్మిదో ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటల 15 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలగ‌డంతో మ్యాచ్‌ను 16 ఓవ‌ర్ల‌కు కుదించారు.

ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కేకేఆర్ 16 ఓవర్లలో ఏడు వికెట్లకు 157 పరుగులు చేసింది. కేకేఆర్ తరఫున వెంకటేష్ అయ్యర్ 21 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ముంబై తరఫున ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, అనుభవజ్ఞుడైన స్పిన్నర్ అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు తీశారు.

లక్ష్య ఛేదన‌కు దిగిన‌ ముంబైకి ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ద్వారా వేగమైన‌ ఆరంభం లభించింది, అయితే పవర్‌ప్లే తర్వాత సునీల్ నరైన్ ఇషాన్‌ను అవుట్ చేయడం ద్వారా ముంబైకి మొదటి దెబ్బ తీశాడు. ఇక్కడి నుంచి ముంబై ఇన్నింగ్స్ పూర్తిగా తడబడి మళ్లీ కోలుకోలేకపోయింది. 13 మ్యాచ్‌ల్లో ముంబైకి ఇది తొమ్మిదో ఓటమి కాగా పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

Next Story