IPL-2025: ఆర్‌సీబీ సూపర్‌ విక్టరీ.. చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ

టీ20ల్లో 100 అర్ధ సెంచరీల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయుడిగా, రెండవ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

By అంజి
Published on : 13 April 2025 7:45 PM IST

IPL 2025, RR vs RCB, Virat Kohli, 100 T20 fifties

IPL-2025: ఆర్‌సీబీ సూపర్‌ విక్టరీ.. చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ

టీ20ల్లో 100 అర్ధ సెంచరీల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయుడిగా, రెండవ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఏప్రిల్ 13 ఆదివారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న డేవిడ్ వార్నర్.. టీ20ల్లో 100 అర్ధ సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్‌గా ఉన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్‌లో వార్నర్ ఈ ఘనత సాధించాడు.

ఆదివారం నాడు కుడిచేతి వాటం కోహ్లీ 39 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున ఫజల్హాక్ ఫరూఖీ స్థానంలో వచ్చిన వనిందు హసరంగా బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టడంతో అతను తన 100వ టీ20 అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీలు

డేవిడ్ వార్నర్ - 108

విరాట్ కోహ్లీ - 100

బాబర్ అజామ్ - 90

క్రిస్ గేల్ - 88

జోస్ బట్లర్ - 86

ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచులో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఛేదించింది. సాల్ట్‌ (65), కోహ్లీ (62), పడిక్కల్‌ (40) పరుగులతో రాణించారు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది నాలుగో విజయం కాగా.. రాజస్థాన్‌కు నాలుగో ఓటమి.

Next Story