ఫైనల్ చేరేది ఎవరు.?

IPL 2025లో క్వాలిఫయర్ 1 కు సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది.

By Medi Samrat
Published on : 29 May 2025 3:11 PM IST

ఫైనల్ చేరేది ఎవరు.?

IPL 2025లో క్వాలిఫయర్ 1 కు సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. పంజాబ్ కింగ్స్ 2014 నుండి మొదటి రెండు స్థానాల్లో నిలవలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరచుగా ప్లేఆఫ్‌లలో ఉన్నప్పటికీ, 2016లో ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ రెండు జట్లు సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి.

శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో రికీ పాంటింగ్ కోచింగ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ టోర్నమెంట్‌ లో సత్తా చాటారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో టైటిల్ గెలుచుకున్న సీజన్ నుండి కొత్తగా వచ్చిన శ్రేయాస్, పాంటింగ్‌ తో కలిసి ఫైనల్ కు చేర్చాడు. కప్ కొట్టే అర్హతలు ఉన్న జట్టుగా పేరున్న రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగా నిలుస్తూనే ఉంది. ఐపీఎల్ గెలవడానికి కేవలం ఇద్దరు సూపర్‌స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనలు మాత్రమే సరిపోవని తెలిపింది. ఈ సీజన్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ అందరూ బ్యాటింగ్‌లో తమ వంతు పాత్ర పోషించగా, యష్ దయాల్, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్‌ బౌలింగ్ లో రాణించారు. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కు రెండు అడుగుల దూరంలో నిలిచి ఉంది.

Next Story