అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయిన జైస్వాల్, సాయి సుదర్శన్‌.. క‌ష్టాల్లో భార‌త్‌

మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా జ‌రిగితే అద్భుతం మాత్రమే భార‌త జట్టు ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోగ‌లదు

By Medi Samrat
Published on : 26 July 2025 6:23 PM IST

అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయిన జైస్వాల్, సాయి సుదర్శన్‌.. క‌ష్టాల్లో భార‌త్‌

మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా జ‌రిగితే అద్భుతం మాత్రమే భార‌త జట్టు ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోగ‌లదు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. అనంత‌రం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసి 311 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌పై భారత్‌ పట్టు సడలినట్లు కనిపించింది.

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన‌ భారత జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్ క్రిస్ వోక్స్ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే హ్యాట్రిక్‌ మిస్సయ్యాడు. తొలి ఓవర్ నాలుగో బంతికి జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు యశస్వి జైస్వాల్. ఆ తర్వాతి బంతికే వోక్స్‌ సాయి సుదర్శన్‌ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఆ ఓవర్ చివరి బంతిని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎదుర్కొన్నాడు. ఈ బంతికి వోక్స్‌తో సహా మొత్తం ఇంగ్లండ్ జట్టు ఎల్‌బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. అయితే అంపైర్ అతని విజ్ఞప్తిని తిరస్కరించడంతో వోక్స్ హ్యాట్రిక్ సాధించలేకపోయాడు. ఇంగ్లండ్ జట్టులో రూట్‌, స్టోక్స్ సెంచ‌రీలు చేశారు.

Next Story