'చాలా ఎదురుచూశాం'.. పెళ్లి ర‌ద్ద‌య్యాక‌ తొలిసారి మాట్లాడిన స్మృతి మంధాన..!

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో తన వివాహాన్ని రద్దు చేసుకున్న తర్వాత మొదటిసారిగా మౌనం వీడింది.

By -  Medi Samrat
Published on : 11 Dec 2025 10:01 AM IST

చాలా ఎదురుచూశాం.. పెళ్లి ర‌ద్ద‌య్యాక‌ తొలిసారి మాట్లాడిన స్మృతి మంధాన..!

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌తో తన వివాహాన్ని రద్దు చేసుకున్న తర్వాత మొదటిసారిగా మౌనం వీడింది. పెళ్లి విచ్ఛిన్నం అయిన‌ తర్వాత ఆమె తొలిసారిగా పబ్లిక్‌గా కనిపించింది. ఒక కార్యక్రమంలో స్మృతి మంధాన మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో.. నాకు క్రికెట్ తప్ప మరేమీ ఇష్టం లేదనే ఒక విషయం బాగా అర్థం చేసుకున్నాను.

మంధాన 2013లో భారతదేశం తరపున అరంగేట్రం చేసింది. ఆమె అరంగేట్రం చేసి 12 సంవత్సరాలు అయ్యింది. ఆమె అరంగేట్రం నుండి ప్రపంచ కప్ గెలుచుకునే వరకూ తన ప్రయాణం గురించి బహిరంగంగా మాట్లాడింది.

కొన్ని రోజుల క్రితం రెండు కుటుంబాల అంగీకారంతో స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వివాహం కుదిరి.. రద్దు కూడా అయ్యింది. డిసెంబర్ 7న ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో వివాహ‌ ప్రకటనను విడుదల చేసింది. అభిమానులు, మీడియా నుండి గోప్యతను కోరింది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నట్లు తెలిపింది.

వివాహం ర‌ద్దు తర్వాత మొదటిసారిగా స్మృతి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి 'అమెజాన్ సంభవ్ సమ్మిట్'కి హాజరయ్యింది. అక్కడ ఆమె తన మొదటి ప్రాధాన్యత క్రికెట్ అని.. భారత్‌కు పెద్ద టైటిళ్లను గెలవడానికి పూర్తిగా అంకితమైందని చెప్పింది. సమ్మిట్‌లో మంధాన మాట్లాడుతూ.. 2013లో తన అరంగేట్రం నుండి గత నెలలో భారత్‌ ప్రపంచ కప్ విజయం వరకు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది.

నాకు క్రికెట్ తప్ప మరేమీ ఇష్టం లేదు. భారత జెర్సీ ధరించడం అతిపెద్ద ప్రేరణ. మీరు మీ సమస్యలన్నింటినీ పక్కన పెట్టండి.. అది మాత్రమే మీకు జీవితంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. తనకు చిన్నప్పటి నుంచి బ్యాటింగ్‌పై మక్కువ ఉందని.. ఏదో ఒకరోజు నన్ను ప్రపంచ ఛాంపియన్ అని పిలుస్తారని చిన్నప్పటి నుంచి నా మనసులో ఉందని స్మృతి తెలిపింది.

ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఎన్నో ఏళ్ల శ్రమ, కష్టాలు ఫలించాయని భావించాను. ఈ విజయం కోసం చాలా ఎదురుచూశాం. మ్యాచ్‌కి ముందు మా మనసులో అది నిజమవడం చూశాం. ఆ క్షణం తెరపైకి రాగానే నాకు గూస్‌బంప్స్‌ వచ్చాయి. మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామిని ఫైనల్‌లో చూడడం జట్టుకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. వాళ్లను కూడా గెలిపించాలనుకున్నాం. వారి కళ్లలో నీళ్లు చూస్తుంటే ఈ విజయం మొత్తం మహిళా క్రికెట్‌దే విజయమనిపించింది. ప్రపంచకప్ తనకు రెండు పెద్ద విషయాలను నేర్పిందని మంధాన చెప్పింది. మొద‌టిది.. మ‌నం గ‌త మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ.. త‌ర్వాతి ఇన్నింగ్స్ సున్నా నుండే ప్రారంభమవుతుంది. రెండవది.. మ‌న‌ కోసం కాదు.. జట్టు కోసం ఆడాలి అంటూ ముగించింది.

Next Story