నేను చెప్పలేను.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా గైర్హాజరుపై మౌనం వీడిన గంభీర్..!

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంపై ఎలాంటి సమాచారం ఇవ్వడానికి భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిరాకరించాడు.

By Medi Samrat  Published on  13 Feb 2025 11:08 AM IST
నేను చెప్పలేను.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా గైర్హాజరుపై మౌనం వీడిన గంభీర్..!

భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీల ఆడటంపై సమాచారం ఇవ్వడానికి భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిరాకరించాడు. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి దూర‌మ‌వ్వ‌డంపై స్పందిస్తూ.. బుమ్రా గురించి అప్‌డేట్ ఇవ్వాలంటే.. వైద్య సిబ్బందే సరైన వ్యక్తులు అని గంభీర్ అన్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి వచ్చింది. సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో.. బుమ్రా చివరి రోజు బౌలింగ్ చేయలేదు.. ఆ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు తీసుకున్నాడు. 32 ఏళ్ల బుమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీ నిమిత్తం భారత జట్టుకు ఎంపిక చేశారు. ఆ త‌ర్వాత‌ వెన్ను గాయం కారణంగా బుమ్రా రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నట్లు BCCI ధృవీకరించింది. ఇంగ్లండ్‌పై భారత జట్టు 3-0తో విజయం సాధించిన తర్వాత బుమ్రా గైర్హాజరు కావడంపై గౌతం గంభీర్ స్పందించాడు.

ఖచ్చితంగా బుమ్రా ఔట్. కానీ నేను మీకు పూర్తి సమాచారం ఇవ్వలేను.. ఎందుకంటే బుమ్రా ఎంతకాలం బయట ఉంటాడో వైద్య బృందం చెప్పగలదు. బుమ్రాపై ఎన్‌సీఏలోని వైద్య బృందం మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు జస్ప్రీత్ బుమ్రాను కోల్పోతుందని.. ఇతర ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి గొప్ప అవకాశం ఉందని కూడా ప్రధాన కోచ్ చెప్పాడు.

అయితే మేము ఎలాగైనా బుమ్రాను జట్టులో చేర్చుకోవాలనుకున్నాం. అత‌డు ఏమి చేయగలడో మాకు తెలుసు. అతడు ప్రపంచ స్థాయి ఆటగాడు. అయితే కొన్ని విషయాలు మ‌న‌ చేతుల్లో ఉండవు. అయితే.. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ బౌల‌ర్లు తమ బాధ్యతను అర్థం చేసుకుని దేశం కోసం ఏదైనా చేసే అవకాశం ఉందన్నాడు.

బుమ్రాకు మద్దతు లభించకపోవచ్చని, అయితే మహ్మద్ షమీ అనుభవం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు ఉపయోగపడుతుందని గంభీర్‌ చెప్పాడు. ODI ప్రపంచ కప్ 2023 తర్వాత మహ్మద్ షమీ తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అతని లయను తిరిగి పొందడం కనిపించింది. కొన్నిసార్లు మ‌నం ఇలాంటివి చూస్తాం. హర్షిత్ రానా మొత్తం సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. కొన్ని ముఖ్యమైన వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ ఏమి చేయగలడో మనందరికీ తెలుసని అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో బీసీసీఐ కొన్ని మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా హర్షిత్ రాణాను చేర్చగా.. యశస్వి జైస్వాల్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా మార్చారు.. వరుణ్ చక్రవర్తికి ప్రధాన జట్టులో చోటు కల్పించారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి జ‌ట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్, షమీ, అర్షిత్, షమీ, అర్ష్‌దీప్, షమీ, అర్ష్‌దీప్, షమీ.

ట్రావెలింగ్ రిజర్వ్: యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివమ్ దూబే

Next Story