'బుమ్రా ఫిజియో చెప్పేది వినాలి' : మాజీ సెలెక్టర్

ఇంగ్లండ్ టూర్‌లో 3 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై విమర్శలు వస్తున్నాయి.

By Medi Samrat
Published on : 18 Aug 2025 9:01 PM IST

బుమ్రా ఫిజియో చెప్పేది వినాలి : మాజీ సెలెక్టర్

ఇంగ్లండ్ టూర్‌లో 3 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై విమర్శలు వస్తున్నాయి. చాలా మంది మాజీ మరియు ప్రస్తుత క్రికెటర్లు కూడా బుమ్రాను సమర్థించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో పేరు చేరింది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ విమర్శల మధ్య జస్ప్రీత్ బుమ్రాపై ప‌డుతున్న‌ పనిభారాన్ని సమర్థించాడు. బౌలర్లు తమ ఫిజియోను వినాలని అన్నారు.

బుమ్రా సిరీస్‌లో మొదటి, మూడు, నాలుగో టెస్టులు ఆడాడు. సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ ఓవల్‌ మైదానంలో జరిగింది. చివరి టెస్టు మ్యాచ్‌కు ముందు భారత జట్టు 1-2తో వెనుకంజలో ఉంది. అయితే ఆ తర్వాత కూడా బుమ్రా చివరి టెస్టు ఆడలేదు. బుమ్రా ఆడిన 3 టెస్టుల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదు.

చేతన్ శర్మ పిటిఐతో మాట్లాడుతూ“వైద్య బృందం సలహా ఇస్తే, నేను యాంటీబయాటిక్స్ తీసుకోవాలని డాక్టర్ చెబితే, నేను వాటిని తీసుకోవాలి. మా ఫిజియోలు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి ఆటగాడికి చెబితే, వారు మంచి న్యాయనిర్ణేతలు కాబట్టి మనం వారి మాట వినాలని నేను భావిస్తున్నాను. 2025 ఆసియా కప్‌లో భారత్‌ మంచి ప్రదర్శన చేస్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను. ఇంగ్లాండ్‌లో భారత జట్టు ప్రదర్శనను ఆయ‌న‌ ప్రశంసించారు.

ఎవరిని ఎంపిక చేసినా దేశం త‌రుపున అత్యుత్త‌మంగా ఆడ‌తార‌ని నాకు తెలుసు. ప్రస్తుతం మనం ఆడుతున్న క్రికెట్ అలాంటిది. ఇంగ్లాండ్‌లో భారత్ ఆడిన ఆట‌తీరు ప‌ట్ల‌ నేను నిజంగా గర్వపడుతున్నాను. మేము ఖచ్చితంగా ఆసియా కప్‌ను గెలుస్తామని నాకు నమ్మకం ఉందన్నాడు.

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ మధ్య జ‌రుగ‌నుంది. భార‌త్‌ సెప్టెంబర్ 10న దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఆ తదుపరి సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

Next Story