ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌లో మరో కొత్త రూల్.. సిక్స్ కొడితే బాల్ మార్చాల్సిందే

BCCI Sets New Protocols in IPL 2021.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్‌)2021 సీజ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2021 6:58 AM GMT
ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌లో మరో కొత్త రూల్.. సిక్స్ కొడితే బాల్ మార్చాల్సిందే

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్‌)2021 సీజ‌న్ మ‌ధ్య‌లోనే అర్థాంత‌రంగా ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. మిగిలిన 31 మ్యాచ్‌ను యూఏఈ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 19 నుంచి అక్టోబ‌ర్ 15 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. కాగా.. టోర్నీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు క‌ఠినమైన కొవిడ్ ప్రొటోకాల్స్‌ను సిద్దం చేసింది బీసీసీఐ. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్‌లోకి సిక్స్‌గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే రూల్ తీసుకొచ్చింది. ఆ బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకొస్తారు. మైదానం ఆవల పడే బంతులను ఇతరులు పట్టుకునే అవకాశం ఉన్నందున.. తిరిగి అదే బంతిని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉంది. అందుకని స్టాండ్‌కు వెళ్లే బంతిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత బాల్ లైబ్రరీలో దాచనున్నారు. ఈసారి ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

- ప్లేయ‌ర్స్‌, సిబ్బంది బ‌యో బబుల్‌లోకి వెళ్లే ముందు ఆరు రోజుల ఐసోలేష‌న్‌లో ఉండాలి. మూడు నెగ‌టివ్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి. ఇంగ్లండ్‌లో ఉన్న ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ బబుల్ నుంచి బ‌బుల్‌లోకి మారేందుకు కొన్ని గైడ్‌లైన్స్ పాటిస్తే.. దుబాయ్‌లో వారికి క్వారంటైన్ అవ‌స‌రం లేదు.

- ఇంగ్లండ్‌లో ఇండియా టూర్‌, శ్రీలంక‌లో సౌతాఫ్రికా టూర్‌, క‌రీబియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ ముగిసిన త‌ర్వాత ప్లేయ‌ర్స్‌, సిబ్బంది, కామెంటేట‌ర్లు, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది అంద‌రూ వారి వారి బ‌యో బ‌బుల్స్‌లోనే కొనసాగాలి. వీళ్లంద‌రినీ హోట‌ళ్ల నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన బ‌స్సుల‌లో ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేష‌న్ ప్ర‌క్రియ అవ‌స‌రం లేకుండా నేరుగా విమానాల ద‌గ్గ‌రికే తీసుకెళ్తారు. దీని కార‌ణంగా వీళ్లు బ‌య‌టి వ్య‌క్తుల‌తో క‌ల‌వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తారు.

- దుబాయ్‌లో ఉన్న గోల్ఫ్ క్ల‌బ్ మిన‌హాయించి ప్లేయ‌ర్స్‌, సిబ్బంది.. బార్లు, రెస్టారెంట్లు, కెఫేలు, జిమ్‌ల‌కు వెళ్ల‌డం నిషేధం.

- ఇక గ్రౌండ్‌లో ఉమ్మ‌డం, ముక్కు చీద‌డం వంటివి చేయ‌కూడ‌దు. కేవ‌లం వాష్‌రూమ్‌ల‌కు మాత్ర‌మే అవి పరిమితం.

- ఒక‌వేళ మ్యాచ్‌లు జ‌రిగే స‌మ‌యంలో ఎవ‌రైన అభిమాని గ్రౌండ్‌లోకి వ‌చ్చి ప్లేయ‌ర్స్‌ను తాకితే.. స‌ద‌రు ప్లేయ‌ర్స్ వెంట‌నే గ్రౌండ్ బ‌య‌ట‌కు వెళ్లి త‌మ దుస్తుల‌ను మార్చుకోవాలి. ఆ త‌ర్వాత చేతుల‌ను 20 సెక‌న్ల పాటు శుభ్రంగా క‌డుక్కున్న త‌ర్వాతే ఇత‌ర ప్లేయ‌ర్స్‌తో క‌ల‌వాలి.

-ప్లేయ‌ర్స్ త‌మ వాట‌ర్ బాటిల్స్‌ను ఎవ‌రికి వారే ఉప‌యోగించాలి. ఒక‌రి బాటిల్ మ‌రొక‌రు వాడ‌కూడ‌దు.

Next Story