హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. ఆస్ట్రేలియా, భారత్ లీడర్ షిప్ సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానం అందింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో మెల్బోర్న్ వేదికగా ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో వివిధ రంగాల్లో పెట్టుబడుల అవకశాలపై చర్చించనున్నారు. ఆస్ట్రేలియా, భారత్ లీడర్ షిప్ సదస్సులో ఇరుదేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, వ్యాపారులు పాల్గొననున్నారు. పెట్టుబడుల బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించనున్నారు.