ఆమె 'పంచ్'కు ప్రభుత్వం అండ కావాలి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 9:39 AM GMT
ఆమె పంచ్కు ప్రభుత్వం అండ కావాలి..!

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మంచి ప్రతిభను కనబరుస్తున్నది. ఈ నేపథ్యంలో నిఖత్‌ జరీన్‌ను టోక్యో - 2020 ఒలింపిక్స్‌కు 51 కేజీల విభాగంలో ఎంపిక చేయాలని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుకు, స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాల్యం నుంచే బాక్సింగ్‌లో మంచి ప్రతిభను కనబరుస్తూ అంచెలంచెలుగా రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఛాంపియన్స్ షిప్‌లలో బంగారు పతకాలు సాధించి దేశానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుక వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. మంచి ప్రతిభ కలిగిన నిఖత్ జరీన్‌ను 2020 లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కు ఎంపిక చేస్తే ఒలంపిక్ పథకాన్ని సాధించే అవకాశం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. నిఖత్ జరీన్ ఒలింపిక్స్ ఎంపికపై సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్తామని నిఖత్ జరీన్ తండ్రి జామీల్ అహ్మద్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గారు పాల్గొన్నారు.

Next Story