రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు అలముకుంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సింగపూర్ వెళ్లాల్సిన టైగర్ ఎయిర్లైన్స్ 2 గంటలు ఆలస్యమైంది. విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి వెళ్లాల్సిన ఓ గంట ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.