'బిగ్‌బాస్‌ 3' కంటెస్టెంట్‌కు క‌రోనా పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2020 7:35 AM GMT
బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌కు క‌రోనా పాజిటివ్

రాష్ట్రంలో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా సీరియళ్ల షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వడంతో ఇటీవల షూటింగ్‌ను ప్రారంభారు. అయితే.. షూటింగ్స్ లో పాల్గొంటున్న ఒక్కొక్కరు కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికే అరడజన్‌కు పైగా ఆర్టిస్టులు ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా బిగ్‌బాస్‌-3 కంటెస్టెంట్‌, 'వరూధిని పరిణయం' ఫేమ్‌ రవికృష్ణ కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని రవికృష్ణనే స్వయంగా వెల్లడించారు.

'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మూడు రోజులుగా నేను ఐసోలేషన్‌లో ఉంటున్నాను. దేవుడి దయ, మీ ఆశీస్సుల వలన ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఈ వైరస్‌ ఎక్కడి నుంచి నాకు సోకిందన్న దానిపై నేనేం బాధపడటం లేదు. అయితే నాతో కాంటాక్ట్‌ అయిన వారందరూ పరీక్షలు చేయించుకొని, ఐసోలేషన్‌లో ఉండమని మాత్రం నేను కోరుతున్నా. అలాగే వైరస్ సోకిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించకండని కోరుతున్నా. నెగిటివిటీకి దూరంగా ఉండి, త్వరగా నేను కోలుకోవాలని ఆశిస్తున్నా' అని రవికృష్ణ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. కాగా ఆమె కథలో రవికృష్ణ సరసన నటించే ‘నవ్య స్వామి’కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.

Next Story