పరుగులు పెట్టనున్న ప్రత్యేక రైళ్లు.!

By సుభాష్  Published on  17 April 2020 5:39 AM GMT
పరుగులు పెట్టనున్న ప్రత్యేక రైళ్లు.!

కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీంతో రైళ్లు సైతం మే 3వ తేదీ వరకు నిలిచిపోనున్నాయి. అయితే కొన్ని గూడ్స్‌ రైళ్లు మాత్రం నిత్యవసర వస్తువులు, అత్యవసర సేవల నిమిత్తం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

సికింద్రాబాద్‌, బెంగళూరు, బెళగావి, గోపాల్‌పూర్‌లోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను ఉత్తర, ఈశాన్యం సరిహద్దులకు తరలించేందుకు ఈ రెండు రైళ్లను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని భారత సైన్యం రైల్వేశాఖను కోరింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఏప్రిల్‌ 17, 18 తేదీల్లో ఈ రెండు ప్రత్యేక రైళ్లు తిగనున్నాయి. ఉత్తర, ఈశాన్య సరహద్దుల్లో కార్యకలాపాల నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల్లోని సైనికులను ఆయా సరిహద్దులకు తరలించేందుకు ఈ రైళ్లను నడపనున్నారు.

ముందుగా రైలు ఏప్రిల్‌ 17న బెంగళూరు నుంచి బయలుదేరి జమ్మూకు చేరుకుంటుంది. రెండో రైలు ఏప్రిల్‌ 18న బెంగళూరు నుంచి గువహాటికి బయలుదేరుతుందని అధికారులు చెబుతున్నారు.

Next Story