హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మొదలై రెండు వారాలు కావొస్తుంది. సమ్మె ఉధృతమతుంది. ఇప్పటికే ఇద్దరు కార్మికులు చనిపోయారు. అయినా ..ప్రభుత్వం మాత్రం మెట్టి దిగి రావడంలేదు. దీంతో ఓ ఆర్టీసీ కార్మికుడు ప్రభుత్వం తీరుకు నిరసనగా గుండు గీయించుకున్నారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా..ఈ రోజు హయత్ నగర్లోని జాతీయ రహదారి పక్కన వంటా -వార్పు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు వంటా - వార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు.