మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

By Newsmeter.Network  Published on  30 Nov 2019 8:04 AM GMT
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఓ సరుకు రవాణా వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. మహారాష్ట్ర దులేలోని వించూర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదంలో ఎడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులుల సహాయక చర్యలు చేపట్టారు. నదిలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Next Story