నగరంలో మరో మహిళ ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం
By Newsmeter.Network Published on 27 Nov 2019 6:21 PM IST
హైదరాబాద్లో వరుసుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదం మరవకముందే.. ఏఎస్రావు నగర్ చౌరస్తాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అతివేగంగా వెళ్తున్న ట్రక్కు.. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ తలపై నుంచి ట్రక్కు టైరు వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. హెల్మెట్తో సహా ఆ మహిళ తల ఛిద్రమైంది. ఏఎస్రావు నగర్ చౌరస్తాలోని రాధిక థియేటర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అయితే ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఘటనా స్ఠలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంకా మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story