ఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు.. ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం మంగళవారం జరిగిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల కమిటీ తొలి సమావేశంలో ఉత్కంఠభరిత దృశ్యాలు కనిపించాయి.
By అంజి Published on 30 Aug 2023 8:15 AM IST
ఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు.. ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం మంగళవారం జరిగిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల కమిటీ తొలి సమావేశంలో ఉత్కంఠభరిత దృశ్యాలు కనిపించాయి. ఒకే కుటుంబానికి రెండు టిక్కెట్ల విషయంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ అంశంపై రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. అయితే ఈ అంశాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర శాఖ చీఫ్గా హైకమాండ్కు ప్రతిపాదన చేయాలని ఉత్తమ్కుమార్రెడ్డి పట్టుబట్టడంతో, రేవంత్ రెడ్డి తనను ఆదేశించవద్దని కోరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు.
అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) తొలి సమావేశం మూడు గంటలకు పైగా కొనసాగింది. బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు. అలాగే ఉదయ్పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని మరికొందరు సభ్యులు డిమాండ్ చేశారు. 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల నుంచి మొత్తం 1,006 దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేయడానికి పీఈసీ సెప్టెంబర్ 2న మరో సమావేశాన్ని నిర్వహించనుంది. అనంతరం తుది నిర్ణయం తీసుకునేందుకు పేర్లను హైకమాండ్కు పంపనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. నవంబర్-డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.