అల్లు అర్జున్‌ పై ఫిర్యాదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Sep 2020 3:21 AM GMT
అల్లు అర్జున్‌ పై ఫిర్యాదు

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కరోనా నిబంధనలను ఉల్లంఘించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బన్ని నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. లాక్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. తిరిగి షూటింగ్‌ ప్రారంభించేందుకు చిత్ర బృందం లోకేషన్లను చూస్తుంది.

ఈ నేపథ్యంలోనే బన్నీ.. చిత్ర బృందంతో కలిసి ఆదిలాబాద్‌ చేరుకుని కుంతల జలపాతంను సందర్శించారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం కుంటాల జలపాతం సందర్శించేందుకు అనుమతులు లేవని, ఆ సినిమా బృందానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తూ.. సమాచార హక్కు చట్టం కార్యకర్త దేవులపల్లి కార్తీక్ మానవ హక్కుల సంఘం కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అల్లు అర్జున్‎తో పాటు మిగతా బృందంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13 న అల్లు అర్జున్‌ కుంతల జలపాతంను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి నుండి మహారాష్ట్రకు చేరుకున్న బన్నీ తిప్పేశ్వర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ప్రస్తుతం బన్నీ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Next Story