చిరు-నాగ్‌లకు ప్రధాని మోదీ ధన్యవాదాలు..

By అంజి
Published on : 4 April 2020 7:04 AM IST

చిరు-నాగ్‌లకు ప్రధాని మోదీ ధన్యవాదాలు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజు రోజుకు క్రమంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ విధించారు. కరోనా వైరస్‌పై పలువురు సీని స్టార్లు, సంగీత దర్శకులు పాటలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు నటులు చిరంజీవి, నాగార్జున, జూనియర్‌ హీరోలు వరుణతేజ్‌, సాయితేజ్‌లు ఒక పాట పాడిన విషయం తెలిసిందే. ఆ పాటపై ప్రధాని స్పందించారు.

'చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం, అందరం సామాజిక దూరం పాటిద్దాం.,కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా #IndiaFightsCorona అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ కూడా జత చేశారు.

కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సీనియర్‌ హీరోలు చిరంజీవి, నాగార్జున, జూనియర్‌ హీరోలు వరుణతేజ్‌, సాయితేజ్‌లు కలిసి పాట పాడారు. పాటలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సర్వపరిచారు. దీంతో వీరంతా ఈ పాటకు గొంతు కలిపారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. చిరంజీవి, నాగార్జున, వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌, కోటి పాడిన ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



సిని కార్మికుల కోసం మెగాస్టార్‌ చిరంజీవి ఏర్పాటు చేసిన క్రైసిస్‌ ఛారిటీకి సినిమా తారాలు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించడంతో సినీ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారిని ఆదుకునేందుకు సినీ నటులు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయం చేస్తూ.. కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు

Next Story