రెండు విమానాలు ఢీ.. ఐదుగురు మృతి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 5:47 AM GMT
రెండు విమానాలు ఢీ.. ఐదుగురు మృతి

ప్రాన్స్‌లో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురితో టూరిస్టులను తీసుకెలుతున్న విమానం, ఇద్దరితో వెలుతున్న మైక్రోలైట్‌ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న అందరూ మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.

ఢీ కొన్న అనంతరం మైక్రోలైట్ విమానం.. ఓ ఇంటి ఫెన్సింగ్ పై పడగా, డీఏ 40 విమానం దానికి కొన్ని వందల మీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ఘటన గురించి మొదట లియాన్ ఎమర్జెన్సీ విభాగానికి తెలిసిందని.. వారు వెంటనే విమానాన్ని ట్రాక్ చేస్తూ వచ్చి ప్రమాదస్థలిని గుర్తించారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించామని, విమానాల్లోని బ్లాక్ బాక్స్ ల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

Next Story